- District News
- Mahabubnagar
- చైతన్య భారతి హై స్కూల్లో ఘనంగా 80వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
చైతన్య భారతి హై స్కూల్లో ఘనంగా 80వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
భారత దేశ ఖ్యాతి , గొప్పతనాన్ని చిన్నారులకు వివరించిన ప్రిన్సిపాల్

మిడ్జిల్ మండల కేంద్రంలోని చైతన్య పార్టీ హై స్కూల్
లో స్కూల్ ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో 80వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల ఆవరణను అందంగా అలంకరించగా, విద్యార్థుల సందడితో స్కూల్ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యత, భారత రాజ్యాంగ గొప్పతనం, దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఉన్న ప్రత్యేక ఖ్యాతి గురించి చిన్నారులకు చక్కటి సందేశాన్ని అందించారు. దేశం కోసం ఎంతోమంది మహనీయులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవడంతో పాటు, భవిష్యత్లో దేశ అభివృద్ధిలో విద్యార్థులు భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
చిన్నతనం నుంచే పిల్లల్లో దేశభక్తి, క్రమశిక్షణ, ఐక్యత, సోదరభావం, బాధ్యతాయుతమైన పౌరస్పృహను పెంపొందించాల్సిన అవసరం ఉందని ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యతో పాటు మంచి విలువలు, సంస్కారం, మానవత్వం కలిగి ఉన్నప్పుడే విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని పేర్కొన్నారు.
అనంతరం విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు. స్వీట్స్ అందుకున్న చిన్నారులు ఎంతో ఆనందంతో కేరింతలు కొడుతూ, నృత్యాలు చేస్తూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల ఆటపాటలు, నృత్యాలతో పాఠశాల ఆవరణ మొత్తం సందడిగా మారింది.
ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్, విద్యార్థులు పాల్గొని 80వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
