మట్టి గణపతిని పూజిద్దాం ప్రకృతిని కాపాడుకుందాం

కేశంపేట మాజీ జెడ్పిటిసి విశాల శ్రావణ్ రెడ్డి

Published On
మట్టి గణపతిని పూజిద్దాం ప్రకృతిని కాపాడుకుందాం

లోకల్ గైడ్ షాద్ నగర్  కేశంపేట: వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కేశంపేట మాజీ జడ్పిటిసి విశాల శ్రావణ్ రెడ్డి సూచించారు. గణపతిని భక్తితో పూజించడంతోపాటు ప్రకృతిని కాపాడే విధంగా పండుగను నిర్వహించుకోవాలని ఆమె కోరారు. పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి కాలుష్యాన్ని తగ్గించేలా ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. భక్తి సాంప్రదాయాలతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ గణేష్ ఉత్సవాలను ఆనందంగా జరుపుకోవాలని విశాల శ్రావణ్ రెడ్డి ఆకాంక్షించారు.

Tags:

About The Author

Related Posts

Latest News

మట్టి గణపతిని పూజిద్దాం ప్రకృతిని కాపాడుకుందాం మట్టి గణపతిని పూజిద్దాం ప్రకృతిని కాపాడుకుందాం
లోకల్ గైడ్ షాద్ నగర్  కేశంపేట: వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కేశంపేట మాజీ జడ్పిటిసి విశాల...
ముందస్తు అరెస్టులు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు
ముగిసిన శ్రావణ మాస భజన కార్యక్రమం.
మహాదేవపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ ధర్నా
మట్టి వినాయకుని పూజిద్దాం..పర్యావరణాన్ని కాపాడుదాం* - కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో మట్టి వినాయకుల తయారీపై విద్యార్థులకు అవగాహన
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే మహాశిల్పులు గురువులు.
మృతురాలి రేషన్‌ కార్డుతో రెండేళ్లుగా బియ్యం స్వాహా? - చనిపోయిన బాలమ్మ పేరుతోనే కార్డు కొనసాగింపు.