- District News
- ముగిసిన శ్రావణ మాస భజన కార్యక్రమం.
ముగిసిన శ్రావణ మాస భజన కార్యక్రమం.
నెల రోజులుగా భక్తిశ్రద్ధలతో కొనసాగిన భజన కార్యక్రమం.
నిర్మల్ : లోకల్ గైడ్ :
కుబీర్ మండలం పార్డి (బి) గ్రామంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో నెల రోజులుగా భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న శ్రావణమాస భజన కార్యక్రమం శుక్రవారం ఘనంగా ముగిసింది. శ్రావణమాసం ప్రారంభం నుంచి ప్రతిరోజూ ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భజనలు, కీర్తనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు, యువత, వృద్ధులు భక్తి పాటలు ఆలపిస్తూ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నెల రోజుల పాటు భజన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన భక్తులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రావణమాస భజన సమాప్తి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంతో ఆలయ పరిసరాలు భక్తి వాతావరణంతో సందడిగా మారాయి.ఈ ఈ కార్యక్రమంలో భజన మండలి సభ్యులు పూజారి జంగం దత్తాత్రి,
గోపు రాజేశ్వర్, శేరి
భోజన్న చింతల రాజన్న, లింగంపల్లి నందు, బండి శంకర్,
కుష్టపూర్ శంకర్,
కొట్టె సాయినాథ్,
గాంధారి సాయినాథ్,
బ్యారపు రమేష్,
దావుల శివ్వయ్య
తదితరులు పాల్గొన్నారు
