ఏసీబీ విచార‌ణ‌కు హాజ‌రైన కేటీఆర్ 

 ఏసీబీ విచార‌ణ‌కు హాజ‌రైన కేటీఆర్ 

లోక‌ల్ గైడ్:
హైదరాబాద్‌: ఫార్ములా-ఈ కారు రేసింగ్ కేసు సంబంధంగా భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన ప్రధాన ఆరోపణలపై ఏ1గా ఉన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు నగదు చెల్లించినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలోనూ కేటీఆర్‌ ఏసీబీ ముందు హాజరైన విషయం తెలిసిందే.
విచారణ సందర్భంగా ఏసీబీ కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరికీ ప్రవేశం అనుమతించడం లేదు. కేటీఆర్‌కు అటూర్నీ రామచందర్రావు తోడుగా వచ్చారు. కేటీఆర్‌ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితురాజ్‌, డీఎస్పీ మాజీఖాన్‌ విచారిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను మాజీదాఖాన్‌ భుజాన వేసుకున్నారు.

హరీశ్ రావు న్యాయవాదులతో సమావేశం:
ఇక తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీశ్ రావు న్యాయవాదులతో భేటీ అయ్యారు. కేటీఆర్‌పై ఏసీబీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి న్యాయపరమైన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. భారాస నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ సహా మరికొంత మంది నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

Latest News

పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలి.. పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలి..
మంచిర్యాల (లోకల్ గైడ్): బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలని ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి సభని రాజేంద్రప్రసాద్ సహాయ కార్యదర్శి పసులేటి...
భూ సమస్యల పరిష్కారానికే భూభారతి రెవెన్యూ సదస్సులు
తెలంగాణలో మరో ఐదు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక
వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో స్మృతి మంధాన అగ్రస్థానం
పాయాను త‌ర‌చూ తింటే క‌లిగే లాభాలు .......
ఇంటర్నేషనల్ యోగ డే 2025 జూన్, 21 న పతంజలి ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం
సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలి