జిల్లాను రాష్ట్రస్థాయిలో ప్రథమంగా సమిష్టిగా కృషి చేద్దాం,

కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన అదనపు కలెక్టర్లు, అధికారులు,

జిల్లాను రాష్ట్రస్థాయిలో ప్రథమంగా సమిష్టిగా కృషి చేద్దాం,

ఉత్తమ పాలనకు ఏడాది మైలురాయి, కలెక్టర్ బాదావత్ సంతోష్‌కు శుభాకాంక్షలు,

లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ జిల్లా 
  తన ఏడాది పాలనలో తనదైన శైలితో ఉత్తమంగా…..  ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ.. ప్రజలకు సేవలు అందిస్తున్న నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సోమవారం  జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం కలెక్టర్ ఛాంబర్ లో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, వివిధ శాఖల జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.....  రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా జిల్లా అధికారులు సమిష్టిగా కలిసి జిల్లా అభివృద్ధికి పాటుపడాలని జిల్లా కలెక్టర్ సూచించారు.  ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలందరికీ పూర్తిస్థాయిలో చేరేలా అధికారులు మరింత నిబద్ధతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాను అభివృద్ధి పథంలోకి వేగంగా తీసుకెళ్లేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ప్రభుత్వ పథకాలు ఎన్నో ఉన్నప్పటికీ, కొన్నిసార్లు అవి అర్హులకు చేరడంలో జాప్యం లేదా అవకతవకలు జరుగుతుంటాయి, ఈ సమస్యలను అధిగమించి, పథకాల లబ్ధి నిజమైన అర్హులను గుర్తించి అర్హులకే చేరేలా చూడాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లక్ష్యాన్ని నెరవేర్చడానికి అత్యంత కీలకంగా జిల్లాస్థాయి అధికారులు వ్యవహరించాలన్నారు, పథకాల అమలులో పారదర్శకతను పాటిస్తూ, అధికారులు తమ విధులకు జవాబుదారీగా ఉండాలని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని, కేవలం కార్యాలయాల్లో కూర్చుని కాకుండా, క్షేత్ర స్థాయిలో పర్యటించి పథకాల అమలును పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం ద్వారా పరిష్కారాలను మరింత సమర్థవంతంగా అమలు చేయవచ్చని కలెక్టర్ అన్నారు. కేవలం సంక్షేమ పథకాల అమలుతో ఆగకుండా, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం వంటి అన్ని రంగాల్లో జిల్లాను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని కలెక్టర్ సూచించారు. అధికారులు తమ శాఖల పరిధిలో సమన్వయంతో పనిచేయడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని తెలిపినారు. కేవలం ఉద్యోగం అనే కాకుండా, ప్రజలకు సేవ చేసే అవకాశం అనే దృక్పథంతో పనిచేయాలని అధికారుల ను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఈ సందర్భంగా ప్రోత్సహించారు.  ఒక సంవత్సరం కాలం జిల్లా అభివృద్ధికి తనతో కలిసి పనిచేసే అధికారులు అందర్నీ కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు రామ్ మోహన్ రావు, రమేష్ కుమార్, సీతారాం నాయక్, స్వరాజ్యలక్ష్మి, రాజేశ్వరి, నాగేందర్, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

Latest News

పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలి.. పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలి..
మంచిర్యాల (లోకల్ గైడ్): బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలని ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి సభని రాజేంద్రప్రసాద్ సహాయ కార్యదర్శి పసులేటి...
భూ సమస్యల పరిష్కారానికే భూభారతి రెవెన్యూ సదస్సులు
తెలంగాణలో మరో ఐదు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక
వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో స్మృతి మంధాన అగ్రస్థానం
పాయాను త‌ర‌చూ తింటే క‌లిగే లాభాలు .......
ఇంటర్నేషనల్ యోగ డే 2025 జూన్, 21 న పతంజలి ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం
సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలి