ప్రభుత్వ ప్రాధామ్యా పథకాల అమలులో జాప్యం వద్దు.
ప్రజావాణి దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలి.-జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.
నల్లగొండ (లోకల్ గైడ్):ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.ఐసిడిఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ మాత్రమే కాకుండా ,గ్రామాలలో అంగన్వాడి, ఆయా, ఆశ వర్కర్ల ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలకు పౌష్టికాహార పంపిణీ, గర్భిణీ స్త్రీలకు నిరంతర పరీక్షలు, చికిత్స , తదితర అంశాలను చూడాల్సిన బాధ్యత ఉందని అన్నారు.అనారోగ్యంతో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి కి వచ్చేవారు అనారోగ్యం ముదిరి చివరి నిమిషంలో రాకుండా ముందే వచ్చే విధంగా అవగాహన కల్పించాలని డి ఎం హెచ్ ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డి సి హెచ్ ఎస్ డాక్టర్ మాతృ, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి డాక్టర్ చంద్రశేఖర్ లకు సూచించారు. త్వరలోనే రాష్ట్ర రవాణా,బి సి శాఖ మంత్రి ఉమ్మడి నల్గొండ జిల్లా సమీక్ష నిర్వహించనున్నందున సంబంధిత అధికారులు సమాచారంతో సమీక్షకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు .
అంతకుముందు ఉదయం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ భవిత కేంద్రాల పనులపై సమీక్షించారు.భవిత కేంద్రాల ఆధునీకరణలో భాగంగా చేపట్టిన మరమ్మతు పనులు, రైలింగ్ ,ర్యాంపు , ఆక్టివిటీ రూమ్ ఇతర సివిల్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. భవిత కేంద్రాలకు సరఫరా చేసిన మెటీరియల్ ను భవిత కేంద్రాల ఇన్చార్జి అధికారులు జాగ్రత్తగా అన్ని ఉన్నాయో లేదో తనిఖీ చేసుకొని తీసుకోవాలని, అన్ని సక్రమంగా ఉన్నట్లు సంతకం చేయాలని చెప్పారు. భవిత కేంద్రం సామాగ్రిని ఎట్టి పరిస్థితులలో కేంద్రం బయట ఉంచకూడదని, భవిత కేంద్రంలోనే ఉంచాలని , మెటీరియల్ ను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఇదివరకే జారి చేసిన ఆదేశాల ప్రకారం అన్ని కేంద్రాలు సవ్యంగా నడిచేలా చూడాలని అన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ,ఇన్చార్జి డి ఆర్ ఓ వై. అశోక్ రెడ్డి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, గృహనిర్మాణ పిడి రాజ్ కుమార్ జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు.