పాఠ‌శాల‌ల్లో హిందీ త‌ప్ప‌నిస‌రి కాదు......

పాఠ‌శాల‌ల్లో హిందీ త‌ప్ప‌నిస‌రి కాదు......

మహారాష్ట్రలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు హిందీ బోధనను తప్పనిసరి చేస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పూనకం తగ్గించింది. ఈ మేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ ఓ ప్రకటనను విడుదల చేసి ‘తప్పనిసరి’ అనే పదాన్ని నోటిఫికేషన్‌లో నుంచి తొలగించింది.ఈ నిర్ణయంపై వ్యతిరేకత పెరగడంతో ప్రభుత్వం ఈమేరకు వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఇప్పుడు హిందీకి బదులుగా విద్యార్థులు మరొక భాషను కూడా ఎంచుకునే అవకాశం కల్పించారు. అయితే ఆ భాషకు సంబంధించి ఆ తరగతిలో కనీసం 20 మంది విద్యార్థులు ఉండాలి అని షరతు పెట్టారు. అవసరమైన ఉపాధ్యాయులు అందుబాటులో లేనిపక్షంలో ఆ సబ్జెక్టుకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.జాతీయ విద్యా విధానం (NEP) ప్రకారం విద్యార్థులు మూడు భాషలు — హిందీ, ఇంగ్లిష్, స్థానిక భాష — నేర్చుకోవాలని కేంద్రం సూచిస్తుంది. కానీ కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా తమిళనాడు, దీనికి తీవ్రంగా వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. తమిళనాడు ద్విభాషా విధానానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేస్తోంది.మహారాష్ట్రలో కూడా ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (MNS) అధినేత రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే లాంటి నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీనిపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చలు వేడెక్కాయి. ఈ వ్యతిరేకతల మధ్య ప్రభుత్వం చివరకు నిర్ణయాన్ని సవరించి, తప్పనిసరి అనే పదాన్ని తొలగించడం కీలకంగా మారింది.

 

Tags:

About The Author

Advertisement

Latest News

*ఇందూర్ జిల్లా కలెక్టర్ ను కలిసిన...అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.. *ఇందూర్ జిల్లా కలెక్టర్ ను కలిసిన...అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా నూతన బాధ్యతలు చేపట్టిన టి. వినయ్ కృష్ణ రెడ్డిని ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు...
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అర్బన్ ఎమ్మెల్యేను ఆహ్వానించిన జిల్లా ఆయుష్ శాఖ...
ఈనాటి బాలలే రేపటి పౌరులు
అలరించిన చిరుతల   రామాయణం
పేద విద్యార్థుల నడ్డి విరుస్తున్న టీఎస్ ఆర్టిసి
సీసీ రోడ్డు, యుజిడీ పనులకు శంకుస్థాపన చేసిన
కళ్యాణ లక్ష్మి - షాదీ ముబారక్  సీఎం సహాయనిది చెక్కుల పంపిణీ