ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు అవగాహన
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనల పైన అవగాహన కలిగి ఉండాలి : గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి
గోదావరిఖని: లోకల్ గైడ్:
ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉండాలని,పిల్లలకు చిన్నప్పటి నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడం ద్వారా వారు భవిష్యత్తు లో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారు అనే ముఖ్య ఉద్దేశ్యం తో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి ఆధ్వర్యంలో రెయిన్ బో ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి ట్రాఫిక్ నియమాలపై ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నప్పటి నుండే పిల్లలలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడం ద్వారా వారు చిన్నప్పుడు నేర్చుకున్న ట్రాఫిక్ నియమాలు, వారి తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు పాటించే విధంగా మరియు వారికీ భవిష్యత్తు లో ఉపయోగకరంగా ఉంటాయి అని సీఐ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసులు నిర్వర్తించే ట్రాఫిక్ విధులను విద్యార్థులకు వివరించడమే కాకుండా, వారితో కలిసి ట్రాఫిక్ నియంత్రణను నిర్వహించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లకలిగే నష్టాలు, రోడ్ సేఫ్టీ వంటి కీలక అంశాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా ట్రాఫిక్ నియంత్రణ మరియు రోడ్డు భద్రతపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించి సురక్షితంగా గమ్యస్థానాల చేరడం, వాహనదారుల భద్రత రక్షణ పోలీస్ బాధ్యత గా ప్రమాద రహిత ప్రాంతంగా మార్చడం కోసమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు.హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న వాహనదారులను గుర్తించి, వారికి విద్యార్థుల చేత గులాబీ పువ్వులు అందచేసి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్ఐ హరి శేఖర్, గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ సిబ్బంది రెయిన్బో స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.