అమెరికా సామ్రాజ్యవాద కాంక్ష భాగమే పాలస్తీనాపై యుద్ధం

అమెరికా సామ్రాజ్యవాద కాంక్ష భాగమే పాలస్తీనాపై యుద్ధం

ఆయుధ వ్యాపారాన్ని విస్తరించేందుకు దేశాలమధ్య చిచ్చుపెడుతున్న ట్రంప్ 
ఇరాన్..ఇజ్రాయిల్ యుద్ధంపై మోడీ నోరుమెదపాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని
ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులను కందిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన

కొత్తగూడెం
(లోకల్ గైడ్ ):ఆయుధవ్యాపారాన్ని విస్తరించుకునేందుకు దేశాల మధ్య చిచ్చుపెడుతూ యుద్ధాలకు అమెరికా ప్రేరేపిస్తోందని, ఇది ట్రాంప్ సామ్రాజ్యవాద కాంక్షకు ఇరాన్..ఇజ్రాయిల్ యుద్ధం పరాకాష్ట అని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు విమర్శించారు. వామపక్ష పార్టీల జాతీయ కమిటీల పిలుపులో భాగంగా గురువారం సంఘీభావ దినాన్ని పాటిస్తూ సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ కార్యాలయాల నుంచి బస్టాండు సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించి అమరవీరుల స్తూపం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ ప్రపంచ దేశాలను తన చెప్పుచేతల్లో పెట్టుకొని కర్రపెత్తనం చేస్తోందని ఆరోపించారు. రెండు దశాబ్దాలుగా పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ నిరంతర బాంబు, వైమానిక దాడులకు పాల్పడుతూ లక్షలాదిమందికి పొట్టన పెట్టుకుంటూ మారణహోమాన్ని సృష్టిస్తుంటే అంతర్జాతీయ చట్టాలు, మానవహక్కులు హరించుకుపోతున్న పరిస్థితిలో పాలస్తీనా ప్రజలకు యావత్ ప్రపంచం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా ప్రోత్సహంతో ఇజ్రాయిల్ జరుపుతున్న భీభత్సవాన్ని నిలిపివేయాలని శాంతి ఖాముఖులు రోడ్లెక్కి ఇతర దేశాలకు స్ఫూర్తినివ్వాలని పిలుపునిచ్చారు. అమెరికా ముందు మోకరిల్లే విధానాలకు స్వస్తిచెప్పి ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంపై ప్రధాని ట్రంపుకు వ్యతిరేకంగా మోడీ  నోరువిప్పాలని, యుద్ధం నిలిపివేసి అక్కడి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, న్యూ డిమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు, న్యూ డిమోక్రసీ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి ముద్ద బిక్షం, న్యూ డిమోక్రసీ నాయకులు కె సురేందర్ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు కంచర్ల జమలయ్య, భూక్యా శ్రీనివాస్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్ రావు, నేరెళ్ల రమేష్, బోయిన విజయ్ కుమార్, సత్యనారాయణాచారి, యూసుఫ్, షాహీన్, సిపిఎం జిల్లా నాయకులు ఏజే రమేష్, బ్రహ్మచారి, లిక్కి బాలరాజు, ఎస్ లక్ష్మి, న్యూ డిమోక్రసీ గౌని నాగేశ్వర్ రావు, కల్తీ వెంకటేశ్వర్లు, ఆదిలక్ష్మి, ప్రణయ్, మాస్ లైన్ నాయకులు  జాటోత్ కృష్ణ, మాచర్ల సత్యం, అమర్లపూడి రాము తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

Latest News