ఇంగ్లండ్ చేతిలో ఓటమి: టీమ్ఇండియా బౌలింగ్ విఫలం, డకెట్ అద్భుత శతకం
ఆట ఐదో రోజు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసంతో ఛేదించింది. సాధారణంగా టెస్టుల్లో ఇటువంటి లక్ష్యాల్ని చేధించడం అరుదుగా జరిగేది. అయితే పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండడం, 'బజ్బాల్' విధానంలో ఆడిన ఇంగ్లండ్ బలంగా ప్రత్యర్థిని మట్టికరిపించింది. మూడు సంవత్సరాల క్రితం భారత్పై బర్మింగ్హామ్లో సాధించిన 378 పరుగుల విజయాన్ని గుర్తు చేస్తూ, హెడింగ్లీ వేదికగా మరోసారి భారత జట్టును చిత్తు చేసింది.
బెన్ డకెట్ (149), క్రాలీ (65), రూట్ (53 నాటౌట్), జెమీ స్మిత్ (44 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్లతో ఇంగ్లండ్ 82 ఓవర్లలో 5 వికెట్లకు 373 పరుగులు చేసి విజయం సాధించింది. భారత బౌలింగ్లో శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ తలా రెండు వికెట్లు తీశారు. బుమ్రా, సిరాజ్ మాత్రం నిరాశపరిచారు.
ఈ విజయం ద్వారా ఐదు టెస్టుల సిరీస్లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా డకెట్ను ఎంపిక చేశారు.
సంక్షిప్త స్కోర్లు:
-
భారత్ తొలి ఇన్నింగ్స్: 471
-
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465
-
భారత్ రెండో ఇన్నింగ్స్: 364
-
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 373/5 (82 ఓవర్లలో)
(డకెట్ 149, క్రాలీ 65; శార్దూల్ 2/51, ప్రసిద్ధ్ 2/92)