నీటి కుంటల నిర్మాణంతో భూగర్భ జలాల అభివృద్ధి... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

Published On
నీటి కుంటల నిర్మాణంతో భూగర్భ జలాల అభివృద్ధి... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

 

కూసుమంచి, ఆగస్టు- 22: లోకల్ గైడ్:

రైతుల పొలాల్లో నిర్మిస్తున్న నీటి కుంటలు (ఫారం పాండ్లు) భూగర్భ జలాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ శ్రీ దివాకర టిఎస్ అన్నారు.

శనివారం కూసుమంచి మండల కేంద్రానికి చెందిన రైతు అర్వపల్లి వెంకటేశ్వర్లు పొలంలో నిర్మిస్తున్న నీటి కుంటను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రధాన రహదారి నుంచి సుమారు 600 మీటర్ల మేర డొంక రహదారిలో నడుచుకుంటూ వెళ్లి నీటి కుంట నిర్మాణ పనులను పరిశీలించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నీటి కుంటల నిర్మాణం వల్ల వర్షపు నీటిని నిల్వ చేసుకోవడంతో పాటు, ఆ నీరు భూమిలోకి ఇంకి సమీపంలోని బోర్లు, బావుల్లో భూగర్భ జలమట్టం పెరుగుతుందని అన్నారు. నీటి నిల్వలు పెరగడం వల్ల భవిష్యత్తులో మత్స్య సంపద అభివృద్ధికి కూడా అవకాశం ఉంటుందని తెలిపారు. 

రైతులు తమ పొలాల్లో నీటి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం నీటి కుంట నిర్మాణం, పనుల పురోగతి, రైతులకు కలిగే ప్రయోజనాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి, రైతులకు ఉపయోగపడే విధంగా పనులు నాణ్యతతో చేపట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కూసుమంచి తహసీల్దార్ సైదులు, గ్రామపంచాయతీ సర్పంచ్ కొండ కృష్ణవేణి, గ్రామపంచాయతీ కార్యదర్శి, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

హార్వెస్ట్ లో ఉపాధ్యాయుల దినోత్సవం హార్వెస్ట్ లో ఉపాధ్యాయుల దినోత్సవం
  ఖమ్మం  సెప్టెంబర్ 5: లోకల్ గైడ్: సర్వేపల్లిరాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని నగరంలోని హార్వెస్ట్పాఠశాల ఉపాధ్యాయులు దినోత్సవ వేడుకలు కృష్ణ వేడుకలు శుక్రవారం నిర్వహించారు హార్వెస్ట్ స్కూలు
కృష్ణనామస్మరణతో మార్మోగిన గేట్ కారేపల్లి!
మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులవ్వాలి.... పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)
వైరాలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
విరాట్ మోటార్స్ నూతన ఓలా షోరూం ఘనంగా ప్రారంభం...
తెలంగాణలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి.