- District News
- Khammam
- కారేపల్లిలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
కారేపల్లిలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
ముఖ్య అతిథిగా వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు బానోత్ మనీషా లక్ష్మి మదన్ లాల్
ఖమ్మం జిల్లా, కారేపల్లి(సింగరేణి ) : లోకల్ గైడ్, జూలై 24 : సింగరేణి మండలం కారేపల్లి టౌన్లో భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు బానోత్ మనీషా లక్ష్మి మదన్ లాల్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బానోత్ మనీషా లక్ష్మి మదన్ లాల్ మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధిలో కేటీఆర్ సేవలు విశేషమని, యువతకు స్ఫూర్తిదాయక నాయకుడిగా నిలిచారని కొనియాడారు. ఆయనకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వంకుడోత్ జగన్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డొంకనా రవీందర్, తాత ఎంకన్న , మాజీ సర్పంచ్లు బన్సీలాల్,మోహన్,సమ్మయ్య,గంగారబోయిన సత్యం,స్వామి, యుగంధర్, శ్రీకాంత్,తెలంగాణ ఉద్యమకారుడు సోమందుల నాగరాజు , యువజన నాయకులు ఆదేర్ల నాగి, గంగారబోయిన మురళి,సంపత్,వికాస్, సన్నీ తదితరులు పాల్గొని కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
