హజ్రత్ అచ్చుమియా దర్గా 580వ ఉర్స్ ఉత్సవాల్లో పాల్గొన్న పి. కార్తీక్ రెడ్డి

Published On
హజ్రత్ అచ్చుమియా దర్గా 580వ ఉర్స్ ఉత్సవాల్లో పాల్గొన్న పి. కార్తీక్ రెడ్డి


రాజేంద్ర నగర్, ( లోకల్ గైడ్ ):      

                           శాస్త్రిపురం డివిజన్ పరిధిలోని హాసన్ నగర్‌లో హజ్రత్ అచ్చుమియా దర్గా 580వ ఉర్స్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇంచార్జి పి. కార్తీక్ రెడ్డి పాల్గొని హజ్రత్ అచ్చుమియా దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ఉర్స్ ఉత్సవాలకు హాజరైన భక్తులను, దర్గా నిర్వాహకులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మత సామరస్యం, సోదరభావం, శాంతి నెలకొనాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సులేమాన్ నగర్ డివిజన్ అధ్యక్షులు మొహమ్మద్ జహీరుద్దీన్, శాస్త్రిపురం డివిజన్ అధ్యక్షులు ముక్రమ్ ఖాన్, కాటేదాన్ అధ్యక్షులు వెంకటేష్,  సీనియర్ నాయకులు సాదిక్ బిన్ యూసుఫ్, షేక్ నయీమ్, ఫెరోజ్, నజీబ్, జాఫర్, దస్తగిర్, అబ్దుల్ రెహమాన్, సయ్యద్ అమీర్, ఇబ్రహీం, మొహమ్మద్ హుస్సేన్, మహబూబ్, సుభాన్, ఖలీల్, కరీమ్ తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులవ్వాలి.... పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులవ్వాలి.... పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)
మహిళా సంఘాలకు అండగా ప్రభుత్వం.. వడ్డీలేని రుణాలు, ఉపాధి అవకాశాలు. సత్తుపల్లిలో ఇందిర మహిళాశక్తి సదస్సు లో పాల్గొని మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన మంత్రి...
వైరాలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
విరాట్ మోటార్స్ నూతన ఓలా షోరూం ఘనంగా ప్రారంభం...
తెలంగాణలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి.  
విద్యార్థుల చదువులకు నరసింహారావు–ప్రసన్న లక్ష్మి దంపతుల చేయూత
మిషన్ భగీరథ నీటి సరఫరా లో పంప్ హౌస్ లో సాంకేతిక అంతరాయం