బోడుప్పల్‌లో బీజేపీకి భారీ బలం.. ఈటల రాజేందర్ సమక్షంలో 50 మందికి పైగా చేరికలు

Published On
బోడుప్పల్‌లో బీజేపీకి భారీ బలం.. ఈటల రాజేందర్ సమక్షంలో 50 మందికి పైగా చేరికలు

 

లోకల్ గైడ్ షామీర్‌పేట్: బోడుప్పల్ డివిజన్‌లో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) మరోసారి భారీగా చేరికలు జరిగాయి. బోడుప్పల్‌కు చెందిన పలువురు ప్రముఖులు, స్థానిక నాయకులు, పెద్దలు బీజేపీలో చేరారు. షామీర్‌పేట్‌లోని మాజీ మంత్రి, ఎంపీ ఈటల రాజేందర్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆయన సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.

బోడుప్పల్ డివిజన్‌కు చెందిన Y. సుధాకర్ రావు, బోడుప్పల్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు Y. శ్రీనివాస్తో పాటు సుమారు 50 మంది పెద్దలు బీజేపీ కండువా కప్పుకున్నారు. డివిజన్ అధ్యక్షుడు రవి యాదవ్, మాజీ కార్పొరేటర్ సామల పవన్ రెడ్డినందకుమార్ జోషి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

బోడుప్పల్ అభివృద్ధి కోసమే బీజేపీలో చేరికలు

బోడుప్పల్ ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం బీజేపీతోనే సాధ్యమనే నమ్మకంతో పలువురు ప్రముఖులు పార్టీలో చేరినట్లు నాయకులు తెలిపారు.

బోడుప్పల్ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పాలన కోసం బీజేపీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై విమర్శలు

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకత్వాలు విఫలమయ్యాయని చేరికల సందర్భంగా బీజేపీ నాయకులు విమర్శించారు.

ప్రజా సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ స్వప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారనే భావనతో ప్రజలు విసిగిపోయారని వారు పేర్కొన్నారు.

బోడుప్పల్‌లో మార్పు మొదలైందన్న బీజేపీ

తాజా చేరికలతో బోడుప్పల్‌లో బీజేపీ మరింత బలోపేతమైందని పార్టీ నాయకులు తెలిపారు.

“బోడుప్పల్‌లో మార్పు మొదలైంది.. ప్రజల కోసం బీజేపీ.. బోడుప్పల్ అభివృద్ధి కోసం బీజేపీ” అంటూ నాయకులు నినదించారు.

Tags:

About The Author

Related Posts

Latest News

వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం
ఖమ్మం,ఆగస్టు,30: లోకల్ గైడ్:ఖమ్మం : వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర మాజీ...
తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ హాస్పిటల్లో నర్స్ దారుణ హత్య. 
మణికొండలో వాక్ విత్ హైడ్రా ర్యాలీ 
మిషనరీ చర్చి భూములను పరిరక్షించాలి.
శిరీష మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి
బోటనీ అధ్యాపకుడి కోసం దరఖాస్తుల ఆహ్వానం.
ప్రజలతో మమేకమైన పోలీసింగ్