- District News
- ప్రజలతో మమేకమైన పోలీసింగ్
ప్రజలతో మమేకమైన పోలీసింగ్
మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో విస్తృత కమ్యూనిటీ పోలీసింగ్
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, లోకల్ గైడ్, ఆగస్టు 30:
ప్రజల భద్రత, నేరాల నియంత్రణ లక్ష్యంగా మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలను విస్తృతం చేశారు. ఇందులో భాగంగా విజిబుల్ పోలీసింగ్, వాహనాల తనిఖీలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
‘మీ సురక్ష’, ‘నేను సైతం 2.0’, ‘క్షేమంగా గమ్యం చేరండి’ వంటి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువవుతున్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడంతోపాటు, అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
వాహనాల తనిఖీలతో అనుమానాస్పద కదలికలపై నిఘా పెంచుతున్న పోలీసులు.. రోడ్డు భద్రత, సైబర్ మోసాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన, నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా పోలీసు-ప్రజల మధ్య సమన్వయం పెంచి, నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.
