- District News
- Ranga Reddy
- మణికొండలో వాక్ విత్ హైడ్రా ర్యాలీ
మణికొండలో వాక్ విత్ హైడ్రా ర్యాలీ
ప్రజా ఆస్తుల పరిరక్షణకు ప్రజల సంఘీభావం
గండిపేట్, ఆగస్టు 30 (లోకల్ గైడ్):
పకృతి వనరుల సంరక్షణే భవిష్యత్తు తరాలకు భద్రత
చెరువులు, కుంటలు, నాలాలు కేవలం నీటి వనరులు మాత్రమే కాదని, అవి నగర పరిరక్షణ వ్యవస్థకు కీలకమైనవని నాయకులు పేర్కొన్నారు. వాటిని కాపాడడం ద్వారా వరదల సమస్యను తగ్గించడంతో పాటు భవిష్యత్తు తరాలకు సురక్షితమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. అభివృద్ధి అవసరమే కానీ ప్రజా ఆస్తులను ప్రకృతి వనరులను నాశనం చేసి చేసే అభివృద్ధి ఎవరికి ఉపయోగపడదని ప్రజా ఆస్తులు ప్రజలకే చెందాలి అన్నారు. వాటిని కాపాడే ప్రతి చర్యకు ప్రజలు అండగా నిలవాలని వారు అన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రా చేపడుతున్న చర్యలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హుడా కాలనీ అధ్యక్షులు దాస్, వెంకటేశ్వరరావు, అల్కాపురి టౌన్షిప్ రవి, అధ్యక్షుడు రాజేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్య సీతారామరాజు, సంఘ సేవకులు మహమ్మద్ ఇక్బాల్, శివశంకర్ రావు హుస్సేన్, ఎమ్మార్పీఎస్ నాయకుడు కుమ్మరి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఇందిరా, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సావిత్రి, ప్రభావతి, మాజీ ఎంపీటీసీ రాజు, అసోసియేషన్ ప్రజా ప్రతినిధులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మహిళలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
