ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ 2025-26 విద్యా సంవత్సరం పరీక్షల క్యాలెండర్ లను
ఆవిష్కరించిన రెవెన్యూ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..
By Ram Reddy
On
లోకల్ గైడ్: ఖమ్మం : ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ 2025-26 విద్యా సంవత్సరంలో గాను ఒలింపియాడ్ పరీక్షల క్యాలెండర్ లను తెలంగాణ రెవెన్యూ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగినది . పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా ఒలంపియాడ్ సౌత్ ఇండియా డైరెక్టర్ అంతోటి రామకృష్ణాని మరియు వారి బృందాన్ని అభినందించారు . ఈ సందర్భంగా సౌత్ ఇండియా డైరెక్టర్ అంతోటి రామకృష్ణ మాట్లాడుతూ ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ గత 2016 సంవత్సరం నుండి దేశవ్యాప్తంగా మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఈ పోటీ పరీక్షలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు . అదే విధంగా సహకరిస్తున్నటువంటి స్కూల్ యాజమాన్యాలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ దివ్య , డిస్టిక్ ఇంచార్జ్ శ్వేత తో పాటు పలువురు పాల్గొన్నారు .
Tags:
About The Author
Latest News
18 Jun 2025 16:53:44
బస్సు పాస్ చార్జీల పెంపు వల్ల ఆందోళన చెందుతున్న పేద విద్యార్థులు
ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పవన్ చౌహన్
జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్...