పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
గత అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర బట్టబయలు
షాద్ నగర్ నియోజకవర్గ రాజకీయ చరిత్రలో ఫోన్ ట్యాపింగ్ కొత్తకోణం
లోకల్ గైడ్, షాద్ నగర్ :రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న ఫోన్ టాపింగ్ కుంభకోణం ఎఫెక్ట్ షాద్ నగర్ అసెంబ్లీకి కూడా తాకింది. బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఎంతోమంది ముఖ్య నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు నిర్ధారణ జరుగుతున్న నేపథ్యంలో అందులో భాగంగానే షాద్ నగర్ నియోజకవర్గంలో కూడా ఇప్పుడు ఈ మంటలు అంటుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, గత ఎన్నికల్లో షాద్ నగర్ అసెంబ్లీ అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేసిన పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయనను విచారణకు పిలిచినట్టు సమాచారం. ఫోన్ టాపింగ్ నేరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరి ఫోన్లు టాపింగ్ అయ్యాయో ఒక జాబితా సిద్ధం చేసింది. ఇందులో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గం నుండి బిజెపి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి