ప్రతి ఒక్కరూ తమ జీవి తంలో డ్రగ్స్ కు నో చెప్పండి..

జిల్లా జడ్జి జీవీఎన్. భరతలక్ష్మి పిలుపు... 

ప్రతి ఒక్కరూ తమ జీవి తంలో డ్రగ్స్ కు నో చెప్పండి..

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: ఈనెల 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మి ఛాంబర్ లో  న్యాయ సేవా సంస్థ కార్య దర్శి ఉదయ్ భాస్కర్ రావు, డీసీపీ బస్వా రెడ్డి లు గోడప్రతులను  ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ మత్తుపదార్థాల డ్రగ్స్  వినియోగంతో భవిష్యత్తు నాశనం అవుతుందని సూచించారు..డ్రగ్స్ మరియు మత్తు పదార్థాలకు  దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాపై పోలీసులు మరింత కఠినంగా ఉండాలని సూచించారు. తమ పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు తరచూ గమనించాలన్నారు.ఈ కార్యక్రమంలో న్యాయ సేవా సంస్థ కార్య దర్శి ఉదయ్ భాస్కర్ రావు, డీసీపీ బస్వా రెడ్డి పాల్గొన్నారు...

Tags:

About The Author

Advertisement

Latest News