- District News
- మండల స్థాయి ప్రజావా ణిని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక.
మండల స్థాయి ప్రజావా ణిని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక.
నారాయణపేట ఆగస్టు 17:
నారాయణపేట జిల్లాలో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు సోమవారం నుంచి ప్రారంభమ య్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.అందులో భాగంగా నారాయణపేట ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్ర మాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ ప్రియాంక లాంఛనం గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రజల నుంచి వివిధ సమస్యలు, వినతులను స్వీకరించి, వాటిని పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారు లను కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మండల స్థాయిలో ప్రజావాణి కార్య క్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించా రు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో కొత్త పింఛ న్లకు వచ్చిన దరఖాస్తుల వివరాలను కంప్యూటర్ ఆపరేటర్ ను అడిగి తెలు సుకున్నారు. కార్యాలయ కార్య కలాపాలను పారద ర్శకంగా కొనసాగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్ర మంలో తహసిల్దార్ అమ రేంద్ర కృష్ణ, ఎంపీడీవో విజ యలక్ష్మి, ఎం ఈ వో బాలా జీ, వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:2.,ప్రజావాణినీ ప్రారంభించిన కలెక్టర్
-------------------------------------
