బొప్నారంలో కాంగ్రెస్‌ గ్రామ కమిటీ ఏర్పాటు.

Published On
బొప్నారంలో కాంగ్రెస్‌ గ్రామ కమిటీ ఏర్పాటు.

లోకల్ గైడ్/బంట్వారం:

మండలంలోని బోపునరం గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ గ్రామ కమిటీతో పాటు వివిధ అనుబంధ విభాగాల కమిటీలను ఏర్పాటు చేశారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను గ్రామ, మండల కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా సన్మానించారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా బంగారి కిష్టయ్య, ఉపాధ్యక్షుడిగా ఎం.డి. రఫీ, కార్యదర్శిగా జి. మల్లికార్జున్‌ ఎంపికయ్యారు. బీసీ సెల్‌ అధ్యక్షుడిగా అన్నసారం పాండయ్య, మైనార్టీ సెల్‌ అధ్యక్షుడిగా ఎం.డి. హైమద్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడిగా డి. మొల్లప్ప, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కే. ఎల్లప్ప తదితరులను నియమించారు. గ్రామంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని నాయకులు సూచించారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ నాయకత్వాన్ని బలపర్చేందుకు కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ యాదగిరి, జె. ప్రభాకర్‌, మోహన్‌రెడ్డి, ముజీబ్‌ పాషా, తొర్మామిడి కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎం.డి. యూసుఫ్‌, బస్వాపూర్‌ గ్రామ పార్టీ అధ్యక్షుడు సిర్రా ఏలీయా, కాంగ్రెస్‌ నాయకులు గొల్ల మైపాల్‌, మాజీ సర్పంచ్‌ ఈ. మహేందర్‌గౌడ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

డ్రోన్ నిఘాతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట... డ్రోన్ నిఘాతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట...
    రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు ప్రజలకు ప్రశాంతమైన,సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా మంచిర్యాల పట్టణం,నస్పూర్,శ్రీరాంపూర్ ప్రాంతాల్లో మంచిర్యాల డిసిపి ఎ
మాగనూర్ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రులకు కృతజ్ఞతలు శివరామ్ రెడ్డి 
ఘనంగా ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి జన్మదిన వేడుకలు 
తాండూరులో 1.26 కిలోల గంజాయి స్వాధీనం.
బొప్నారంలో కాంగ్రెస్‌ గ్రామ కమిటీ ఏర్పాటు.
ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెంచాలి
చదువుతోనే ఉన్నత భవిష్యత్తు.. విద్యార్థులకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచన