- District News
- మాగనూర్ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రులకు కృతజ్ఞతలు శివరామ్ రెడ్డి
మాగనూర్ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రులకు కృతజ్ఞతలు శివరామ్ రెడ్డి
నారాయణపేట ఆగస్టు 20:
మక్తల్ నియోజకవర్గం మాగనూరు మండలం అభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి కి మాగనూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షు డు శివరామ్ రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. మండలం లోని ఆరు గ్రామాలకు అడవి సత్యారం నుండి పెగడబండకు నాలుగు కోట్లు,అమ్మపల్లి నుండి పరమహం దొడ్డి వరకు మూడు కోట్లు, నేరేడుగాం దొడ్డి నుండి తాళం కేర్ కి బ్రిడ్జ్ 50 లక్షలు,పిడబ్ల్యుడి రోడ్డు నుండి మంది పల్లి వరకు 13 కోట్లు,మాగనూరు నుండి నేరెడ్గం వరకు 8 కోట్లు,నేరేడుగం నుండి నేరేడుగం.దొడ్డి వరకు ఐదు కోట్లు మొత్తం ఆరు రోడ్లకు గాను సుమారు 35 కోట్లు మాగనూరు మండలంలోని వివిధ గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణం కొరకు మంజూరు చేసిన తెలంగాణ పంచా యతీరాజ్ మంత్రి సీతక్క, మంత్రివాకిటి శ్రీహరి మండలంలోని అన్ని గ్రామాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఫోటో రైట్ అప్:8.శివరామ్ రెడ్డి
___________________
