- District News
- Khammam
- తెలంగాణ భావజాలానికి మార్గదర్శి ప్రొఫెసర్ జయశంకర్కు ఘన నివాళి
తెలంగాణ భావజాలానికి మార్గదర్శి ప్రొఫెసర్ జయశంకర్కు ఘన నివాళి
Published On
By Ram Reddy
ఖమ్మం జిల్లా, కారేపల్లి ( సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగస్టు 6: సింగరేణి మండల పరిధిలోని రావొజీతండా గ్రామపంచాయతీ కార్యాలయంలో మహోన్నత విద్యావేత్త, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి, ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను శాస్త్రీయ ఆధారాలతో దేశవ్యాప్తంగా చాటి చెప్పి, తెలంగాణ ప్రజల్లో చైతన్యం నింపిన మహనీయుడిగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. విద్య ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలన్న ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అలాగే విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని, సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తూ మహనీయుల ఆశయాలను కొనసాగించాలని కోరారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బి. బాలు, పంచాయతీ కార్యదర్శి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఆశా కార్యకర్త, అంగన్వాడీ టీచర్, పాఠశాల విద్యార్థులు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించారు.
Tags:
About The Author
Related Posts
Latest News
07 Aug 2026 08:37:35
రాజీ ప్రయత్నాలపై స్థానికుల్లో పలు అనుమానాలు.
