- District News
- Khammam
- గాంధీచౌక్ వర ప్రదాత శ్రీషిర్డీసాయి మందిరంలో సామూహక కుంకుమ పూజ
గాంధీచౌక్ వర ప్రదాత శ్రీషిర్డీసాయి మందిరంలో సామూహక కుంకుమ పూజ
ఖమ్మం,ఆగస్టు,28: లోకల్ గైడ్:
ఖమ్మం గాంధీచౌక్ వర ప్రదాత శ్రీషిర్డీసాయి మందిరంలో శ్రావణ శుక్రవారం రోజు సామూహక కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు . అధిక సంఖ్యలో మహిళా లు పాల్గొని విజయవంతం చేశారు . ఎంతో పవిత్రమైన శ్రావణ శుక్రవారం నాడు ఈ సామూహక కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం దీనికి అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందని ఆలయ చైర్మన్ డాక్టర్ వేములపల్లి వెంకటేశ్వర రావు తెలిపారు . ఆ అమ్మవారి కటాక్షం ఉంది ధనవృద్ధి , ఆర్థిక స్థిరత్వం , వ్యాపారాభివృద్ధి , కార్యసిద్ధి & ఐశ్వర్యప్రాప్తి అందరిపై ఉండాలని ఆకాంక్షించారు . సుమారు 200 మంది మహిళలు పాల్గొన్నారు . ఈ కార్యక్రమం అర్వపల్లి నిరంజన్ , పి వి ప్రసాద్ , కే జగన్ మోహన్ రావు , గన్నవరపు నాగేశ్వరరావు , శీలం హనుమంతరావు , కాకరపర్తి సూర్యనారాయణ , బోనగిరి ఉమేష్ , సీమకుర్తి వెంకటేశ్వరరావు , మందిర అర్చకులు ఇంద్రగంటి కిరణ్ శర్మ , జనార్ధన చార్యులు , రామడుగు నరసింహాచార్యులు , వరప్రదాత విష్ణు సభ్యులు , సాయిభజన మండలి సభ్యులు , వివిధ దేవాలయ ప్రధాన అర్చకులు పాల్గొన్నారు .
