- District News
- Khammam
- పొంగులేటి' అభయం.. నిరుద్యోగులకు 'రైట్ ఛాయిస్'!
పొంగులేటి' అభయం.. నిరుద్యోగులకు 'రైట్ ఛాయిస్'!
ఖమ్మం, కొత్తగూడెంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉచిత కోచింగ్
ఖమ్మం,ఆగస్టు17: లోకల్ గైడ్:
పోలీస్ కొలువు సాధించి ఖాకీ డ్రెస్లో చూడాలనే పేద తల్లిదండ్రుల కలలకు, నిరుద్యోగ యువత పట్టుదలకు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉచిత కోచింగ్ కొండంత అండగా నిలుస్తోంది. రాష్ట్రంలో ఎస్ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో.. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని అభ్యర్థుల కోసం ఖమ్మం, కొత్తగూడెం పట్టణాల్లో ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఖమ్మంలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్య నాయకులతో కలిసి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇంచార్జి తుంబూరు దయాకర్ రెడ్డి మంగళవారం గోడపత్రికను ఆవిష్కరించారు.
రాష్ట్రంలో పోటీ పరీక్షల శిక్షణలో అగ్రగామిగా ఉన్న 'రైట్ ఛాయిస్ అకాడమీ' చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ నేతృత్వంలో ఈ పొంగులేటి ఉచిత శిక్షణ సాగుతుందని నిర్వాహకులు తెలిపారు. గతంలో 2016లో పొంగులేటి-రైట్ ఛాయిస్ కలయికలో ఇచ్చిన శిక్షణ ద్వారా ఒకే బ్యాచ్ నుంచి ఏకంగా 326 మంది కానిస్టేబుళ్లు, 18 మంది ఎస్ఐలు ఎంపికై చరిత్ర సృష్టించారని కిరణ్ గుర్తుచేశారు. ఉద్యోగం సాధించాలనే బలమైన సంకల్పం ఉన్న ప్రతి అభ్యర్థి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
శిక్షణ పొందేందుకు అభ్యర్థులు తమ వివరాలను (పేరు, ఫోన్ నంబర్, గ్రామం, మండలం, నియోజకవర్గం) క్రింది నంబర్లకు వాట్సాప్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఖమ్మం జిల్లా అభ్యర్థులు 8985095599, భద్రాద్రి కొత్తగూడెం అభ్యర్థులు 8985096699 సంప్రదించాలని మెండెం కిరణ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో బొర్రా రాజశేఖర్, ఏదులాపురం మున్సిపాలిటీ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, కోసూరి శ్రీను, కొప్పుల అశోక్ , బజ్జూరి వెంకట్ రెడ్డి, కౌన్సిలర్ వెంకట్ రెడ్డి, వెన్నుపూసల సీతారాములు, బానోత్ కిశోర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
