- District News
- Nalgonda
- సామాజిక న్యాయం చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్.
సామాజిక న్యాయం చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్.
నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత.
80 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణంలోని శివాజీ నగర్ టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా జాతీయ జెండాను నల్గొండ డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య రావడానికి ఆనాటి కాంగ్రెస్ మహనీయుల పోరాటాన్ని గుర్తుకు చేస్తూ నేడు మనం అభివృధి పథంలో ఉన్నామంటే ఆనాటి ప్రధాని నెహ్రూ దురదృష్టి కారణమన్నారు. దేశం ఆర్థిక సామాజిక న్యాయ రంగాల ఫలితాలను పేదలకు అందజేసిన ఘనత కాంగ్రెస్కు దక్కిందన్నారు. దేశభక్తి త్యాగాలు కాంగ్రెస్కు సొంతమని నేడు బిజెపి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం విడ్డూరమన్నారు. దేశ సంపాదనను అంబానీలకు ఆదానిలకు దోచిపెడుతున్న బిజెపి నకిలీ దేశభక్తులు అని విమర్శించారు.ఈ కార్యక్రమంలో ఓబీసీసెల్ జిల్లా అధ్యక్షులు జిల్లాపల్లి పరమేష్, ఎస్సీ సెల్ చైర్మన్ బోడ స్వామి,జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ముంతాజ్ అలీ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ల రవీందర్ రెడ్డి,జిల్లా కార్యదర్శి పగిళ్ల రాజు, చర్ల పెళ్లి గౌతమ్,చింతమల్ల వెంకయ్య, ఎండి అజీజ్, ఎండి ఫిరోజ్ ఖాన్, పగిళ్ల శివ,శ్రీనివాస్,మట్టపల్లి నాగరాజ్,గుడిపాటి శివ, వవిల్ల దేవదాస్, సచిన్,
వినీత్,శరత్,మంజునాథ్,నవీన్,బాలు, తదితరులు పాల్గొన్నారు .
