వధూవరులకు పట్టు వస్త్రాలతో ఆశీర్వాదం.. సర్పంచ్ ఉమా నరేష్!

Published On
వధూవరులకు పట్టు వస్త్రాలతో ఆశీర్వాదం.. సర్పంచ్ ఉమా నరేష్!

 


కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 5, లోకల్ గైడ్ న్యూస్ : మాదారం గ్రామంలో అజ్మీర రవి పద్మ దంపతుల కుమార్తె విహా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాదారం గ్రామ సర్పంచ్ అజ్మీర ఉమా నరేష్ హాజరై నూతన వధూవరులను పట్టు వస్త్రాలతో ఆశీర్వదించారు. నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు కిలారి అప్పారావు, గుర్రం నర్సయ్యతో పాటు వార్డు సభ్యులు అజ్మీరా శారద, రజిని, బాలాజీ, సంధ్య, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. విహా వేడుకల సందర్భంగా మాదారం గ్రామంలో సందడి నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ పెద్దలు నూతన దంపతులను ఆశీర్వదించి వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.

Tags:

About The Author

Latest News

బియ్యంతో శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో గణనాథుడి ప్రతిష్ట  బియ్యంతో శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో గణనాథుడి ప్రతిష్ట 
        గండిపేట్, సెప్టెంబర్ 17 లోకల్ గైడ్: నార్సింగి సర్కిల్ పరిధిలోని కోకాపేట్ ఐసీసీ బ్యాంకు వెనుక గాయత్రి ఎన్క్లేవ్, సుమ్మి రెసిడెన్సి ప్రాంతంలో బాలగణపతి యూత్
అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తెలంగాణ… రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
కిలారి సుశీలకు నివాళి
చిరుమర్రి చెరువు వద్ద రూ. 2.90 కోట్లతో పర్యాటక వసతుల అభివృద్ధి
సెప్టెంబర్‌ 17.. పోరాట చరిత్రకు మైలురాయి
ప్రభుత్వ, వైద్య కళాశాల సీట్లు సాధించిన పూర్వ విద్యార్థులకు ఘన సన్మానం
దేశభక్తి, ఐక్యత సోదర భావంతో ముందుకు సాగాలి