శంషాబాద్ లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి  వేడుకలు.              

పలు పాఠశాలలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు. 

Published On
శంషాబాద్ లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి  వేడుకలు.              

 

శంషాబాద్, ( లోకల్ గైడ్ ): 

శంషాబాద్ జోన్ పరిధిలోని వివిధ పాఠశాలల్లో శుక్రవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు  పలు పాఠశాలల్లో శ్రీ కృష్ణుడు, సత్యభామ వేశాలు వేయించి సాంస్కృతికIMG-20260904-WA0155 కార్యక్రమాలను నిర్వహించారు.  కుండలో వెన్న తయారు చేయడం ఆ కుండలో ఉన్న వెన్నను చిన్నారి కృష్ణుడు దొంగిలించి తినడం. అది చూసి అతని తల్లి పట్టుకొని మందలించడం లాంటి ప్రదర్శణలు ఆకట్టుకున్నాయి. చాలమంది చిన్నారి విద్యార్థులు శ్రీకృష్ణుడు - సత్యభామ వేశాల్లో పాఠశాలలకు వెల్లిరావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేవాలయంలో ఉత్సవాలు : శ్రీకృష్ణజన్మాష్టమి పండుగ సందర్భంగా శంషాబాద్ జోన్ పరిధిలోని బ్రహ్మణవాడలో గల శ్రీకృష్ణమందిర్ దేవేలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారు జామునుంచే ప్రత్యేకపూజలు జరిగాయి. శ్రీకృష్ణుడి జన్మాష్టమి సందర్భంగా డోలాహరణ పూజ జరుగుంతుందని దేవాలయ పూజారీ తెలిపారు. ఈ పండుగ సందర్భంగా ఆయా మహిలందరూ తమ తమ ఇండ్ల ముందు భగవంతుడు శ్రీకృష్ణుడు మా ఇంటిలోకి రావాలని పూజలు నిర్వహించి దేవుడు తన చిన్నారిపాదలతో తమ ఇంట్లోకి నడుచుకుంటూ వస్తాడనే నమ్మకంతో సున్నం ముగ్గులు వేసి ఆ ముగ్గు మధ్యలో చిన్ని కృష్ణుడి పాదాలు వేశారు. ఈ ముగ్గులు పలు ఇండ్ల ముందు కనిపించడంతో పండుగ వాతావరణం కనిపించింది.

,

:

Tags:

About The Author

Latest News

స్వచ్ఛతే లక్ష్యం.. సూర్యతండా ప్రభుత్వ పాఠశాల ముందడుగు స్వచ్ఛతే లక్ష్యం.. సూర్యతండా ప్రభుత్వ పాఠశాల ముందడుగు
        స్వచ్ఛతను కేవలం కార్యక్రమంగా కాకుండా నిత్యజీవితంలో భాగంగా మార్చే దిశగా సూర్యతండా ప్రభుత్వ పాఠశాల ముందడుగు వేసింది. ‘స్వచ్ఛతా హి సేవ–2026’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో
నారాయణ ఈ టెక్నా్ స్కూల్ లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు.
ఎస్ ఎల్ బిసి సొరంగ మార్గాన్ని మే 2028 నాటికి పూర్తి చేసి జూన్ 2028లో నీటిని విడుదల చేస్తాం.
పిల్లలకు క్యాన్సర్ చికిత్స విధానంలో తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలి .
యువతకు అండగా.. ప్రజల్లో మమేకంగా! గుడిపూడి తిరుమల రావు 
పేదల పొట్టపై ధరల పోటు.. ఉపాధి హామీ బలోపేతం చేయాలి
బియ్యంతో శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో గణనాథుడి ప్రతిష్ట