క్రైమ్ పార్టీ పోలీసులపై ఫిర్యాదు.. చర్యలేవి?

రూ.20 వివాదంలో మహిళపై దాడి చేశారన్న ఆరోపణలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైనా ముందుకు సాగని విచారణ?

రాజీ ప్రయత్నాలపై స్థానికుల్లో పలు అనుమానాలు.
Published On

లోకల్ గైడ్/తాండూరు.
 వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఇద్దరు క్రైమ్ విభాగానికి చెందిన పోలీసు సిబ్బందిపై గత రెండు రోజుల క్రితం నమోదైన ఫిర్యాదు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రూ.20 వివాదంలో ఓ మహిళపై దాడి చేశారన్న ఆరోపణలతో సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైనప్పటికీ, ఇప్పటివరకు సంబంధిత పోలీసు సిబ్బందిపై ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకున్నారన్న దానిపై స్పష్టత లేకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది.
ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందిన తర్వాత విచారణ ఏ దశలో ఉందనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు సిబ్బందిని విచారించారా? శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేశారా? లేక కేసు విచారణ ఇంకా కొనసాగుతోందా? అనే అంశాలపై అధికారిక సమాచారం బయటకు రాలేదు.
ఇదిలా ఉండగా, ఈ వ్యవహారాన్ని పై అధికారుల దృష్టికి వెళ్లకుండా రాజీ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ప్రచారం స్థానికంగా చర్చకు దారితీసింది. ఫిర్యాదు నమోదైన కేసులో పారదర్శకంగా విచారణ జరిపి, వాస్తవాలను వెలికితీసి, తప్పు నిర్ధారణ అయితే సంబంధిత పోలీసు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Tags:

About The Author

Latest News

క్రైమ్ పార్టీ పోలీసులపై ఫిర్యాదు.. చర్యలేవి? క్రైమ్ పార్టీ పోలీసులపై ఫిర్యాదు.. చర్యలేవి?
రాజీ ప్రయత్నాలపై స్థానికుల్లో పలు అనుమానాలు.
కారేపల్లి ప్రజల సమస్యలపై పాలకవర్గం వెంటనే స్పందించాలి
సమతా మూర్తి స్పూర్తి కేంద్రం సామరస్యతకు  చిరునామా.  శ్రీ రామానుజుల సమానత్వ సందేశం నేటికీ సజీవం. ముచ్చింతల్‌లో సమతా మూర్తి స్పూర్తి కేంద్ర సందర్శన లో రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా
టి న్యూస్ ఛానల్ రిపోర్టర్ పై దాడికి పాల్పడిన నిందితులపై
గద్దర్ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి
వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి: డీఎంహెచ్‌వో డా. సీహెచ్. ధనరాజ్
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఆచార్య కొత్తపల్లి