- District News
- శ్రీ శ్రీ శ్రీ లోకాయపల్లి లక్ష్మమ్మ మాత ఉత్సవాలు ఘనంగా ప్రారంభం
శ్రీ శ్రీ శ్రీ లోకాయపల్లి లక్ష్మమ్మ మాత ఉత్సవాలు ఘనంగా ప్రారంభం
నారాయణపేట ఆగస్టు 13:
శ్రావణమాస ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ లోక పల్లి లక్ష్మణ జాతర ఉత్స వాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి.గురువారం ఉదయం ఎక్లాస్పూర్ భక్తులు గ్రామ పెద్దలు, చిన్నారులు, ఆలయ కమిటీ సభ్యులందరూ, భక్తిశ్రద్ధలతో, మేళ తాళాలతో, భజనలు చేస్తూ, శ్రీ ఆలయ పూజారి, సోమశేఖర స్వామి, ఇంటి నుండి బయలుదేరి, నారాయణపేట పురవీధుల గుండా తిరుగుతూ, ఏ క్లాస్ పూర్ గ్రామం చేరుకొని శ్రీతిమ్మప్ప స్వామి దేవాలయము గుండా లక్ష్మమ్మ దేవాలయంకి పల్లకి సేవ చేశారు.ఇట్టి పల్లకి సేవలో ఆలయ కమిటీ గౌరవాధ్యక్షులు హరి నారాయణ బట్టడ్ , ఆలయ కమిటీ అధ్యక్షులు, శశికాంత్ యాదవ్ గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ గౌడ్ ,అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి పల్లకిని ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నారాయణపేట మున్సిపా లిటీ వైస్ చైర్మన్ మంజుల రెడ్డి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు కన్న జగదీష్ , ఎల్ రాధాకృష్ణ , కూరగాయల రవికుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వేముల మధుసూదన్ రెడ్డి, సహకార దర్శి గొల్ల బుగ్గన, ఉషప్ప,సభ్యులు పిల్లి నరసింహులు, కే ఆనంద్, సంతోష్ నామాజీ, రమా. కాంత్ సలహాదారులు బండగొండ పెద్ద రాంరెడ్డి, ఆత్మారామ్ హెడ్క్. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అమ్మవారి మహిళా సేవా సమితి సభ్యులు సురేఖ, చిలాల్ అరుణ,భక్తులు, పాల్గొని అమ్మవారి పల్లకి సేవ విజయవంతం చేశారు. ఉత్సవాల్లో భాగంగా నేటి శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం సందర్భంగా భక్తులకు క్యూలైన్ నేర్పా ట్లు, మంచినీటి సౌకర్యం, వాహనాల పార్కింగ్, దేవా లయాలకు రంగుల అలంక రణ, పూలఅలంకరణ, భక్తులు నైవేద్యాలు సమ ర్పించుటకు, తగిన ఏర్పా ట్లు ఆలయ కమిటీ సభ్యు లు చేయడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లోకపల్లి లక్ష్మమ్మ మాత ను దర్శించుకొని అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందాలనీ కోరారు.
ఫోటో రైట్ అప్:అమ్మవారి పల్లకి ఊరేగింపు
_____________________
