గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి -

ఎస్ హెచ్ ఓ శ్రీనివాస్ రెడ్డి. 

Published On
గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి -

 

శంకర్ పల్లి, ( లోకల్ గైడ్ ):                                              గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని మొకిలా ఇన్స్పెక్టర్ ఎస్. శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు రాబోయే గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని మొకిల పోలీస్ స్టేషన్‌లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులు, సంబంధిత ప్రతినిధులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మొకిల పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుల సమయంలో పాటించాల్సిన భద్రతా జాగ్రత్తలు, మార్గదర్శకాలను ఎస్‌హెచ్‌ఓ ఎస్. శ్రీనివాస్ రెడ్డి పలు సూచనలు చేశారు. 
గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, క్రమశిక్షణతో నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. ట్రాఫిక్, శబ్ద నియంత్రణ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, గణేష్ మండపాల వద్ద విద్యుత్, అగ్నిమాపక భద్రతకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసు శాఖతో పాటు ఇతర సంబంధిత శాఖలు జారీ చేసే సూచనలు, నిబంధనలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపులు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. గణేష్ ఉత్సవాలకు అన్ని ప్రాంతాల్లో తగిన పోలీసు బందోబస్త్ ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ఎక్కడైనా శాంతి భద్రతలకు విఘతం కలిగినట్లయితే సమాచారం అందించాలని అయన సూచించారు.

Tags:

About The Author

Latest News