ఎండుతున్న వరి  ఆందోళనలో రైతన్నలు

ప్రభుత్వం ఆదుకోవాలి.

తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులుముదిరెడ్డి సుధాకర్ రెడ్డి డిమాండ్.    
Published On
ఎండుతున్న వరి  ఆందోళనలో రైతన్నలు

* --
 

 


 

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్ .


 ఎల్ నీనో ప్రభావంతో అడుగంటిన భూగర్భ జలాలు  బోర్లు పోయాక రైతులు వేసిన పంటలో డెబ్బై శాతం పంట ఇప్పటికే పూర్తిగా ఎండిపోయి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారని తక్షణమే ప్రభుత్వం స్పందించి నష్టపోయిన పంట పొలాలకు అంచనా వేసి ఆర్థిక వ్యయాన్ని ప్రకటించి రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం  నలగొండ మండలంలోని రసుల్పురం గ్రామంలోని ఎండిపోయిన పంట పొలాలను రైతు సంఘం బృందం పరిశీలించారు.ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏ ఎం ఆర్ పి కాలువ ద్వారా డిస్ట్రిబ్యూటరీ 37 క్రింద ఉన్న గ్రామాల చెరువులను, కుంటలను వెంటనే నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ చెరువులను నింపడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి బోర్లు పోయడంతో కొంత పంటలను కాపాడుకోవచ్చని , పశువులకు గొర్రెలకు మేకలకు పక్షులకు జీవనాధారమ్ అవుతాయని తెలిపారు.
కృష్ణా జలాలతో నింపి  ప్రజల కష్టాలను తీర్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు సయ్యద్ హసీమ్, నలపరాజు సైదులు, మండల  కార్యదర్శి దొండ కృష్ణారెడ్డి మండల నాయకులు బొల్లు రవీందర్, పగిళ్ల సైదులు, గుండెబోయిన జానయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పేదల పొట్టపై ధరల పోటు.. ఉపాధి హామీ బలోపేతం చేయాలి పేదల పొట్టపై ధరల పోటు.. ఉపాధి హామీ బలోపేతం చేయాలి
        కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 17 (లోకల్ గైడ్ న్యూస్) : నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతూ పేదల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ధరల
బియ్యంతో శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో గణనాథుడి ప్రతిష్ట 
అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తెలంగాణ… రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
కిలారి సుశీలకు నివాళి
చిరుమర్రి చెరువు వద్ద రూ. 2.90 కోట్లతో పర్యాటక వసతుల అభివృద్ధి
సెప్టెంబర్‌ 17.. పోరాట చరిత్రకు మైలురాయి
ప్రభుత్వ, వైద్య కళాశాల సీట్లు సాధించిన పూర్వ విద్యార్థులకు ఘన సన్మానం