- District News
- Ranga Reddy
- విద్యాభివృద్ధికి రాజా బహదూర్ చేసిన కృషి మరువలేనిది
విద్యాభివృద్ధికి రాజా బహదూర్ చేసిన కృషి మరువలేనిది
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
( లోకల్ గైడ్ షాద్ నగర్ )
రాజా బహదూర్ వెంకటరామి రెడ్డి జయంతి సందర్భంగా షాద్నగర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ సమాజంలో విద్యాభివృద్ధికి, మహిళా విద్యకు విశేష ప్రాధాన్యతనిస్తూ ప్రజల అభ్యున్నతికి రాజా బహదూర్ వెంకటరామి రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధికి ఆయన చూపిన మార్గం ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో విద్యా వెలుగులు నింపేందుకు, యువతకు మెరుగైన భవిష్యత్తును అందించేందుకు ఆయన చేసిన కృషి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని అంజయ్య యాదవ్ తెలిపారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, మాజీ లక్ష్మీనరసింహా రెడ్డి, మాజీ పీఎసీఎస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, మండల అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, రాజరామేశ్వర్ రెడ్డి, రాములు, కౌన్సిలర్లు శారద శేఖర్, వాణి పాండురంగారెడ్డి, వసంత శ్రీనివాస్, గోపాల్, మాజీ కౌన్సిలర్లు వెంకట్రాం రెడ్డి, కానుగు అంతయ్య, నాయకులు నక్కల వెంకటేష్ గౌడ్, లంకాల రాఘవేందర్ రెడ్డి, రవి యాదవ్, నందిగామ శ్రీనివాస్, భువనేశ్వర్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి, జగన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
