- District News
- Ranga Reddy
- రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం..
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం..
జిల్లా.అద్యక్షులు చల్లా నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో
లోకల్ గైడ్ న్యూస్ 22 కొందుర్గ్
కర్మన్ ఘాట్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంజరిగింది
ఈ సమావేశానికి షాద్నగర్ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా డీసీసీ కార్యదర్శి ఎర్రవరం అంజిరెడ్డి పాల్గొన్నారు ఈరోజు జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ముఖ్యాతిథిగా గౌరవ ఎఐసిసి నియమించిన కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్సీ,రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షుల ఎన్నికల పరిశీలకులు సివి మోహన్ పాల్గొన్నా సమావేశములో పలు అంశాలు చర్చించారు..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిందని,ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం,కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడం,కార్యకర్తల సమస్యల పరిష్కారం,రాబోయే కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించాడం చాలా సంతోషంగా ఉందని అన్నారు..
డీసీసీ అధ్యక్షుల నియామకానికి సంబంధించి అలాగే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు మరియు ప్రతి డివిజన్,ప్రతి బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి,ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచే దిశగా సమష్టిగా ముందుకు సాగాలని నిర్ణయించాం అని తెలిపారు..
,
