- District News
- విద్యార్థి కుటుంబానికి రెడ్క్రాస్ సొసైటీ లక్ష ఆర్థిక సహాయం
విద్యార్థి కుటుంబానికి రెడ్క్రాస్ సొసైటీ లక్ష ఆర్థిక సహాయం
నారాయణపేట ఆగస్టు 22:
నారాయణపేట మండలం ఎక్లాస్పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదు వుతున్న విద్యార్థి పాము కాటుకు గురై మృతి చెంది న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నిరుపేద కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా రెడ్క్రాస్ సొసైటీ అధ్య క్షురాలు సి.హెచ్. ప్రియాంక, ఆదేశాల మేరకు శనివారం జిల్లా రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వ ర్యంలో బాధిత కుటుంబాని కి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.
విద్యార్థి కుటుంబంలోని జీవించి ఉన్న ఇద్దరు సోద రులైన 5వ తరగతి, 2వ తరగతి చదువుతున్న చిన్నారుల పేరిట ఎస్బీ ఐలో ఒక్కొక్కరికి .50 వేల చొప్పున రెండు ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను ఏర్పా టు చేశారు. ఈ బాండ్లను విద్యార్థుల తల్లిదండ్రులు పిచ్చిగుంట్ల గురునాథ్ దంపతులకు జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన జిల్లా రెడ్క్రాస్ సొసైటీ ప్రతినిధులను అభి నందించారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు మాన వతా దృక్పథంతో సహాయ సహకారాలు అందించ డంలో రెడ్క్రాస్ సొసైటీ ముందుండాలని సూచించా రు.అనంతరం జిల్లా రెడ్క్రా స్ సొసైటీ సభ్యత్వ నమో దు, జిల్లా బాడీ ఎన్నికల నిర్వహణ తదితర అంశా లపై సమావేశంలో సమీక్షిం చారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్క్రాస్ సొసైటీ చైర్మ న్ కొట్టం సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్ సరఫ్ నాగరా జ్, కోశాధికారి డాక్టర్ మదన్మోహన్ రెడ్డి, స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యులు ఆత్మారం ఎడ్కే, ప్యాట్రన్ శ్రీ హరినారాయణ భట్టాడ్, వై ఆర్ సి,జే ఆర్ సి కోఆర్డి నేటర్లు జొన్నల సుభాష్, నందుపాటిల్, సభ్యులు శ్రీనివాస్ లాహోటి, యూసు ఫ్ తాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:8.ఆర్థిక సహాయం అందజేసిన కలెక్టర్
