కార్మికులకు కనీస వేతనాం 30000    ఇవ్వాలి

సమాన పనికి సమాన వేతనం కల్పించాలి.... రాష్ట్ర కార్యదర్శి గాదె మహేందర్....వెల్లడి

భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిరసన
Published On
కార్మికులకు కనీస వేతనాం 30000    ఇవ్వాలి

హనుమకొండ జిల్లా ప్రతినిధి,ఆగస్టు17
(లోకల్ గైడ్ న్యూస్)

హనుమకొండ, కార్మికులకు కనీస వేతనం 30000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి గాదె మహేందర్ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం కల్పిస్తూ కనీస వేతనం రూ. 30000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిత్య అవసర ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ కార్మికులు, ఉద్యోగులు, వేతనాలు, పెన్షన్లు, సామాజిక భద్రత పథకాలు, సంక్షేమ సౌకర్యాలు అదే స్థాయిలో పెరగడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి పెరుగుతున్న నిత్యవసర వస్తువులను దృష్టిలో పెట్టుకొని కార్మికులకు కనీస వేతనం రూ. 30,000 అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కార్తీక్, విద్యుత్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శశి కుమార్, నిట్ అధ్యక్షులు కరుణాకర్, ప్రధాన కార్యదర్శి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు
  ఆగస్టు 29(లోకల్ గైడ్) హైదరాబాద్‌లోని బండ్లగూడ జగీర్‌కు చెందిన 49 ఏళ్ల సర్జన్‌ను ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసగించారు. జులై 2025లో
Toxic Box Office Collection Day 3: తగ్గుతున్న కలెక్షన్లు.. వరల్డ్‌వైడ్‌గా యష్ ‘టాక్సిక్’ సాధించిందెంత?
Google Pixel Watch 5: AI ఆధారిత GPS టెక్నాలజీతో పిన్‌పాయింట్ లొకేషన్ ట్రాకింగ్! గూగుల్ మ్యాప్స్ 3D మోడల్స్, AI సహాయంతో బ్యాటరీ లైఫ్ తగ్గకుండా లొకేషన్ ఆక్యురేసీ
పాకిస్థాన్ బ్యాటింగ్ ఘోర వైఫల్యం: మైఖేల్ వాన్ ఘాటు విమర్శలు! | Pak vs Eng Test కౌంటీ క్రికెట్ స్థాయి కూడా లేదంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆగ్రహం
నేపాల్‌ వరదలు: విదేశీ సహాయక బృందాలకు ఎట్టకేలకు అనుమతి
రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి:
ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు.