ఎర్త్ అవర్‌లో భాగంగా లోక్ భవన్‌లో గంటపాటు దీపాల ఆర్పివేత

ఎర్త్ అవర్‌లో భాగంగా లోక్ భవన్‌లో గంటపాటు దీపాల ఆర్పివేత

హైదరాబాద్, మార్చి 28: పర్యావరణ పరిరక్షణ, భూతాపం (గ్లోబల్ వార్మింగ్) పై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించే ‘ఎర్త్ అవర్’ కార్యక్రమంలో లోక్ భవన్ భాగస్వామ్యమైంది.

 

ఈ సందర్భంగా శనివారం రాత్రి 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు లోక్ భవన్ పరిధిలోని ప్రధాన భవనం, సిబ్బంది నివాస సముదాయం, అధికారుల క్వార్టర్స్, పరిపాలనా భవనాల్లో ఒక గంటపాటు విద్యుత్ దీపాలను నిలిపివేశారు.

 

ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా, ఈ ఏడాది “గివ్ అన అవర్ ఫర్ ఎర్త్” అనే థీమ్‌కు అనుగుణంగా దీపాలను ఆర్పివేసి పర్యావరణ పరిరక్షణకు తమ మద్దతును తెలియజేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరాన్ని ప్రజలకు గుర్తుచేసే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.

Tags:

About The Author

Related Posts

Latest News