అమ్మాయిల పొట్టి పోరుకు ముహూర్తం

    మహిళల టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ విడుదల

అమ్మాయిల పొట్టి పోరుకు ముహూర్తం

  జూన్ 12 నుంచి జూలై 5 వరకు ఈ మెగా టోర్నీ

  పాకిస్తాన్ మ్యాచ్‌తో భారత్‌ తొలి అడుగు

దుబాయ్‌: క్రికెట్ అభిమానులకు వరుసగా మిలియన్ల చూపులను ఆకర్షించే మెగా టోర్నీలను అందించేందుకు ఐసీసీ మరో అడుగు వేసింది. భారత్‌, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే మహిళల వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ ప్రకటించిన ఐసీసీ, తాజాగా 2026లో ఇంగ్లండ్‌లో జరగనున్న మహిళల టీ20 వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ఈ మెగా టోర్నీ జూన్ 12న ప్రారంభమై, జూలై 5న క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్‌ వేదికగా ఫైనల్‌తో ముగుస్తుంది. మొత్తం 12 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటాయి. జూన్ 30న మొదటి, జూలై 2న రెండో సెమీఫైనల్‌లు జరుగుతాయి.

మ్యాచ్‌లు ఇంగ్లండ్‌లోని ఏడు వేదికలపై జరుగుతాయి: ఎడ్జ్‌బాస్టన్‌, హాంప్‌షైర్ బౌల్‌, హెడింగ్లీ, ఓల్డ్ ట్రాఫర్డ్‌, ది ఓవల్‌, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్స్‌, లార్డ్స్‌. జూన్ 12న ఆతిథ్య ఇంగ్లండ్ ఎడ్జ్‌బాస్టన్‌లో శ్రీలంకతో ఆడుతూ టోర్నీని ప్రారంభిస్తుంది. భారత జట్టు జూన్ 14న అదే వేదికపై పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడి టైటిల్ పోరాటానికి శ్రీకారం చుట్టుతుంది. జూన్ 28న లార్డ్స్‌లో భారత్‌–ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌తో లీగ్ దశ ముగుస్తుంది.

రెండు గ్రూపులు

12 జట్లు రెండు గ్రూపులుగా విభజించబడ్డాయి.

    గ్రూప్–1: ఆరు సార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా, గత టోర్నీ రన్నరప్ దక్షిణాఫ్రికా, భారత్‌, పాకిస్తాన్‌తో పాటు ఇంకా నిర్ణయించాల్సిన రెండు క్వాలిఫయింగ్ జట్లు ఉంటాయి.

    గ్రూప్–2: డిఫెండింగ్ చాంపియన్స్ న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, ఆతిథ్య ఇంగ్లండ్‌తో పాటు రెండు క్వాలిఫయింగ్ జట్లు ఈ గ్రూపులో ఉన్నాయి.

లీగ్ దశ పూర్తయ్యాక ప్రతి గ్రూపులో టాప్–2 జట్లు సెమీఫైనల్‌కి అర్హత పొందుతాయి.

Tags:

About The Author

Advertisement

Latest News