ముదిరాజ్ హక్కులపై అసెంబ్లీలో మాట్లాడాలి: హరీశ్‌రావుకు వినతిపత్రం

బీసీ ‘ఏ’లోకి మార్చే హామీని వెంటనే అమలు చేయాలి.

ముదిరాజ్ హక్కుల సాధన సమితి
Published On
ముదిరాజ్ హక్కులపై అసెంబ్లీలో మాట్లాడాలి: హరీశ్‌రావుకు వినతిపత్రం

సిద్దిపేట ఆగస్ట్ 26(లోకల్ గైడ్):

ముదిరాజులను బీసీ ‘డి’ నుంచి బీసీ ‘ఏ’లోకి మారుస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ముదిరాజ్ హక్కుల సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును కలిసి వినతిపత్రం అందించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ముదిరాజుల హక్కులు, మత్స్యకారుల సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాలయాపన చేయకుండా అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమం కోసం చేపపిల్లల పంపిణీతో పాటు టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలు, చేపలు పట్టే పరికరాలు, ఇతర సామాగ్రి అందించే కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారులు, ముదిరాజుల సంక్షేమానికి కొత్త పథకాలు అమలు చేయడం లేదని విమర్శించారు.చేపపిల్లల పంపిణీ కార్యక్రమం కూడా సక్రమంగా అమలు కాకపోవడంతో మత్స్యకారుల కుటుంబాలు నష్టపోతున్నాయని ఆరోపించారు. ముదిరాజులకు బీసీ ‘ఏ’ రిజర్వేషన్ కల్పించడంతో పాటు మత్స్యకారుల సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని, పెండింగ్ హామీలను కార్యాచరణ ప్రణాళికతో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ముదిరాజుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని హరీశ్‌రావును నాయకులు కోరారు. హామీల అమలుకు ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, రాష్ట్ర యూత్ అధ్యక్షులు పడిగె ప్రశాంత్ ముదిరాజ్, నంగునూరు మండల అధ్యక్షులు గూళ్ల మధు, రాగుల సతీష్, పిట్ల భాస్కర్, పిట్ల సంజీవ్, కుమార్, చందు, బాలరాజు, రఘు, శ్రీనివాస్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఈనెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం... ఈనెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం...
    మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)   తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాంలో భాగంగా మంచిర్యాల మెడికల్ కళాశాల గోడౌన్ ప్రాంగణంలో
మతసామరస్యంతోనే సమాజంలో శాంతి.
నూతన "శుభం కన్వెన్షన్" ప్రారంభం.
ఖమ్మం జిల్లా లో మొట్ట మొదటి సారిగా పోలీస్ ఉద్యోగి నుంచి వచ్చిన అకాడమీ ఒకె ఒక అకాడమీ వి.ఐ.పి పోలీస్ అకాడమీ..
శివ రెడ్డి పేట్ లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు
మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా అన్నదానం.
_______ముఖ్య శిక్షక్ కుమారుని పెళ్ళిలో బిజెపి నేతల సందడి