పార్టీకి నష్టం కలిగిస్తున్న "నాసర్‌"పై చర్యలు తీసుకోవాలి.

పార్టీ కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ ఆరోపణలు.

వెంటనే సస్పెండ్ చేసి బహిష్కరించాలి  - కాంగ్రెస్ పార్టీ ఎనిమిదో వార్డు ఇన్చార్జ్ సాయప్ప.
Published On
పార్టీకి నష్టం కలిగిస్తున్న

లోకల్ గైడ్ /తాండూర్: 
కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తూ, పార్టీలో అనవసర వివాదాలకు కారణమవుతున్నారని ఇందిరమ్మ కాలనీకి చెందిన నాసర్‌పై చర్యలు తీసుకోవాలని ఆ వార్డు ఇన్‌చార్జి సాయప్ప, మాజీ కౌన్సిలర్ వెంకన్న గౌడ్, పలువురు స్థానిక మహిళా నాయకులు పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
"నాసర్" కాంగ్రెస్ పార్టీ నాయకుడినంటూ చెప్పుకుంటూ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. గత ఎమ్మెల్యే, ఎంపీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించారని పేర్కొన్నారు. ఇప్పుడేమో
వార్డు కమిటీల ఏర్పాటుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు .ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు తాండూర్ పట్టణంలో చేపడుతున్న వార్డు కమిటీల ఏర్పాటుకు నాసర్ అడ్డంకులు సృష్టిస్తున్నారని వారు ఆరోపించారు. ఒకే వార్డులో రెండు కమిటీలు ఏర్పాటు చేయాలంటూ వివాదానికి తెరలేపుతున్నారని, పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలపై అనవసర ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు.పార్టీలో అంతర్గతంగా సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉండగా, బహిరంగంగా వివాదాలు సృష్టించడం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే అధిష్ఠానం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
నాసర్ వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయనున్నట్లు వార్డు ఇన్‌చార్జి సాయప్ప, మాజీ కౌన్సిలర్ వెంకన్న గౌడ్ తెలిపారు.

Tags:

About The Author

Latest News

కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు
    రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి 
సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభం
స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
సెల్ఫ్ టీచింగ్‌తో సత్తా చాటిన విద్యార్థులు
ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత, అర్హత కలిగిన వారికి బెస్ట్ అవైలబుల్, ఉన్నత విద్య అమలు,