స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

తర్వాత వంతెనకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.

Published On
 స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

హైదరాబాద్:

సైదాబాద్ స్టీల్ ఫ్లైఓవర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ (గురువారం) ప్రారంభించారు. స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం అనంతరం దానిపై ఆయన ప్రయాణించారు. ఆ తర్వాత వంతెనకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఫ్లైఓవర్ వివరాలను ముఖ్యమంత్రికి జీహెచ్‌ఎంసీ అధికారులు వివరించారు.IMG-20260903-WA0454 దీని ప్రారంభంతో గ్రేటర్ హైదరాబాద్‌లో మరో భారీ వంతెన అందుబాటులోకి వచ్చినట్లైంది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

భాగ్యనగరంలో ఇప్పటికే అతి పొడవైన స్టీల్ వంతెన 2.3 కిలోమీటర్ల పొడవుతో ఇందిరాపార్కు నుంచి వీఎస్‌టీ వరకు ఉంది. తాజాగా సైదాబాద్ స్టీల్ బ్రిడ్జిని 3.32 కి.మీ.ల పొడవుతో రూ.620 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ వంతెన చంచల్‌గూడ జైలు నుంచి సంతోష్‌ నగర్‌లోని యాదగిరి థియేటర్‌ వరకు ఉంది. కాగా, వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నాలుగు లేన్ల ఈ బ్రిడ్జి నిర్మాణానికి 2020లో శంకుస్థాపన జరిగింది.
ఈ వంతెన అందుబాటులోకి రావడంతో నల్లగొండ ఎక్స్‌ రోడ్డు నుంచి ఒవైసీ ఆస్పత్రి జంక్షన్‌ వరకు 5 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం లభించింది. కాగా, ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణించేందుకు 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతోంది. తాజాగా బ్రిడ్జి ప్రారంభంతో నగరవాసులకు ప్రయాణం సులభం కానుంది.. KP

Tags:

About The Author

Latest News

కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు
    రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి 
సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభం
స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
సెల్ఫ్ టీచింగ్‌తో సత్తా చాటిన విద్యార్థులు
ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత, అర్హత కలిగిన వారికి బెస్ట్ అవైలబుల్, ఉన్నత విద్య అమలు,