- District News
- ప్రణాళిక బోర్డు వైస్ చైర్ మేన్ చిన్నారెడ్డి పై మల్లి కార్జున్ ఖర్గే కి ఫిర్యాదు .
ప్రణాళిక బోర్డు వైస్ చైర్ మేన్ చిన్నారెడ్డి పై మల్లి కార్జున్ ఖర్గే కి ఫిర్యాదు .
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి .
వనపర్తి లోకల్ గైడ్ ప్రతినిధి ఆగస్ట్ 21:
వనపర్తి కాంగ్రేస్ పార్టీ ప్రజా ప్రతినిధుల,నాయకులతో కలసి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శుక్రవారం ఢిల్లీ లో మల్లికార్జున్ ఖర్గే కు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి పై ఫిర్యాదు చేసిన ట్లు ఒక ప్రకటనలో ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు.
కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ పై చిన్నారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆయన తెలిపారు. అంతే కాకుండా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీఫారమ్ ను డబ్బులకు అమ్ముకున్నారంటూ ఆరోపించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి అనుచిత వాక్యాలు చేసినందుకు చర్యలు తీసుకోవాలనీ కార్గేను కోరిన్నట్లు ఆయన తెలిపారు. తాము ఇచ్చిన ఫిర్యాదు పై సానుకూలంగా స్పందించిన కార్గే ఆయన పై పూర్తిస్థాయిలో విచారించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పిన్నట్లు ఎమ్మెల్యే పెర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్దలు తదితరులు ఉన్నారు.
