- District News
- Ranga Reddy
- పోగొట్టుకున్న 25 మొబైల్ ఫోన్లు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ.. ...
పోగొట్టుకున్న 25 మొబైల్ ఫోన్లు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ..
బాధితులకు అందజేసిన అత్తాపూర్ పోలీసులు.
Published On
By Ram Reddy
ఈ సందర్భంగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎ. సీతయ్య మాట్లాడుతూ ఫోన్ బాధితులను పోలీస్ స్టేషన్కు పిలిపించి, తగిన ఆధారాలు సరిచూసుకున్న అనంతరం వారి మొబైల్ ఫోన్లను నేరుగా అందజేశారు. పోయాయనుకున్న తమ విలువైన ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ, అత్తాపూర్ పోలీసులకు, క్రైమ్ టీమ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఎ. సీతయ్య మాట్లాడుతూ "ఎవరైనా తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్నా లేదా దొంగతనానికి గురైనా కంగారు పడకుండా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో గానీ లేదా ఆన్లైన్ ద్వారా క్యూర్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేసుకోవాలి. సి ఈ ఐ ఆర్ పోర్టల్లో ఐఎంఈఐ (ఐ ఎం ఈ ఆర్ నంబర్ను బ్లాక్ చేయడం ద్వారా ఫోన్ దుర్వినియోగం కాకుండా చూడటమే కాకుండా, దానిని త్వరగా ట్రాక్ చేసి రికవరీ చేయడానికి సులభమవుతుంది అని సూచించారు.
ఈ కార్యక్రమంలో అత్తాపూర్ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాజు నాయక్ తో పాటు క్రైమ్ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
20 Aug 2026 12:29:38
రాజేంద్ర నగర్ 19 ఆగస్టు ( లోకల్ గైడ్ ) పోగొట్టుకున్న కున్న 25 మొబైల్ ఫోన్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సి.ఇ.ఐ.ఆర్ పోర్టల్ సహాయంతో
