- District News
- జిల్లా పోలీస్ కార్యాలయంలో కాళోజి జయంతి వేడుకలు
జిల్లా పోలీస్ కార్యాలయంలో కాళోజి జయంతి వేడుకలు
Published On
By Ram Reddy
తెలంగాణ ప్రజాకవి,సాహితీవేత్త,సామాజిక చైతన్యవాది కాళోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు పోలీస్ అధికారులు ఆయన కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతు కాళోజి తన రచనలు,కవిత్వం ద్వారా ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని కలిగించారని,ప్రజల సమస్యలను తన సాహిత్యం ద్వారా నిర్భయంగా వ్యక్తం చేసిన గొప్ప ప్రజాకవి అని కొనియాడారు.సమాజంలో సమానత్వం,న్యాయం,మానవతా విలువల కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.కాళోజి సాహిత్యం నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని,ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు ఆచరించాలని తెలిపారు.ప్రజాసేవలో ఉన్న పోలీసు అధికారులు,సిబ్బంది కూడా ప్రజల పట్ల బాధ్యతాయుతంగా,మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు.
Tags:
About The Author
Related Posts
Latest News
09 Sep 2026 13:40:14
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు
