జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నీట్-పీజీ 2026 పరీక్ష.. అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

Published On
జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నీట్-పీజీ 2026 పరీక్ష.. అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

ఖమ్మం, ఆగస్టు- 30: లోకల్ గైడ్:
ఖమ్మం జిల్లాలో నీట్-పీజీ 2026  పరీక్ష ఆదివారం ప్రశాంతంగా,  సజావుగా ముగిసినట్లు అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాల్లో నీట్ పరీక్షా నిర్వహణకు రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరీక్ష ప్రక్రియ పూర్తి పారదర్శకతతో జరిగినట్లు తెలిపారు.

జిల్లాలో రెండు పరీక్షా కేంద్రాలకు 
668 విద్యార్థులను కేటాయించగా, 642 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 26 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.

అదనపు కలెక్టర్ తనిఖీ సందర్భంగా జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవి బాబు, అధికారులు వున్నారు.

Tags:

About The Author

Latest News