భీక్య తండలో ఘనంగా తీజ్ వేడుకలు

గిరిజన సంప్రదాయాలను ప్రభుత్వాలు కొనసాగించాలి

పాల్గొన్న మాజీ మండల ప్రధాన కార్యదర్శి, గిరిజన నాయకుడు అజ్మీరా వీరన్న
Published On
భీక్య తండలో ఘనంగా తీజ్ వేడుకలు

 

 

 

కారేపల్లి : లోకల్ గైడ్ న్యూస్, ఆగష్టు 30 :
కారేపల్లి మండల పరిధిలోని భీక్య తండ గ్రామంలో తీజ్ వేడుకలను ఆదివారం గిరిజనులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు కొనసాగిన తీజ్ ఉత్సవాల్లో గిరిజన యువతులు సంప్రదాయబద్ధంగా పాల్గొని వేడుకలను నిర్వహించగా, చివరి రోజు గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గిరిజన నాయకుడు, మాజీ మండల ప్రధాన కార్యదర్శి అజ్మీరా వీరన్న పాల్గొని మాట్లాడారు. గిరిజనుల ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలను గ్రామాల్లో కొనసాగించేలా ప్రభుత్వాలు ప్రత్యేకంగా ప్రోత్సహించాలని కోరారు. గిరిజనుల ఓట్లతో గెలుస్తున్న పాలకులు గిరిజనుల పట్ల వివక్ష చూపకుండా వారి సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు. తొమ్మిది రోజులపాటు గిరిజన యువతులు తీజ్ సంప్రదాయాన్ని కొనసాగించడం అభినందనీయమని అజ్మీరా వీరన్న పేర్కొన్నారు. ఇలాంటి సంప్రదాయ పండుగలను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.

Tags:

About The Author

Latest News

వాహనం అమ్మారా.. ఆర్టీఏ రికార్డుల్లో యాజమాన్య బదిలీ తప్పనిసరి! వాహనం అమ్మారా.. ఆర్టీఏ రికార్డుల్లో యాజమాన్య బదిలీ తప్పనిసరి!
  లోకల్ గైడ్  సెప్టెంబర్ 10  మహబూబాబాద్  వాహనం అమ్మిన తర్వాత ట్రాన్స్‌ఫర్ చేయించుకోకపోతే చట్టపరమైన ఇబ్బందులు తప్పవు మహబూబాబాద్ జిల్లా వాహన యజమానులు తమ వాహనాలను
తుక్కుగూడలో కేటీఆర్ ధర్నా కార్యక్రమానికి వెళుతున్న బి ఆర్ ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్. 
ఖమ్మం జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలలకు ఆట వస్తువుల సరఫరాకు షార్ట్ టెండర్ ఆహ్వానం…
భాగ్యనగర్ తండా రైల్వే సమస్యపై ఎస్టీ కమిషన్‌కు వినతి
దళిత రైతుల ఆగ్రహం ఉవ్వెత్తున.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి – లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం
_కొలన్ హనుమంత రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరైన నాయకులు
పాఠశాలలో ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం.