మానవత్వమే మార్గం.. సేవే లక్ష్యం – డా. రవి బదావత్

మృతుడి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం.. కష్టకాలంలో అండగా నిలిచిన మిషన్ వాక్ రిహాబిలిటేషన్ వ్యవస్థాపకుడు

Published On
మానవత్వమే మార్గం.. సేవే లక్ష్యం – డా. రవి బదావత్

 


ఖమ్మం జిల్లా, కారేపల్లి (సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగష్టు 12 : మానవత్వాన్ని మార్గంగా చేసుకుని, సేవను లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు మిషన్ వాక్ రిహాబిలిటేషన్ వ్యవస్థాపకుడు డా. రవి బదావత్. ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ తన సేవా దృక్పథాన్ని మరోసారి చాటుకున్నారు.
సింగరేణి మండలం మాదారం పరిధిలోని కొత్తతండాకు చెందిన అజ్మీరా పకీరా ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న డా. రవి బదావత్ వారి కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా డా. రవి బదావత్ మాట్లాడుతూ.. కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు. ఆప్తుడిని కోల్పోయిన కుటుంబానికి ఆర్థిక సహాయంతో పాటు మనోధైర్యం కల్పించడం కూడా అవసరమని పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, వారికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
మిషన్ వాక్ రిహాబిలిటేషన్ సంస్థ వైద్య సేవలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ, అవసరమైన సమయంలో ప్రజలకు అండగా నిలుస్తుందని డా. రవి బదావత్ తెలిపారు. సమాజంలో వెనుకబడిన, ఆపదలో ఉన్న కుటుంబాలకు తనవంతు సహకారం అందించడమే సేవా లక్ష్యమన్నారు.
కష్ట సమయంలో తమ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన డా. రవి బదావత్‌కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తమకు అందించిన సహాయం మరువలేనిదని పేర్కొన్నారు.
మానవత్వమే మార్గం.. సేవే లక్ష్యం అనే సందేశంతో డా. రవి బదావత్ అందిస్తున్న సేవలు స్థానికంగా పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి.

Tags:

About The Author

Latest News