- District News
- Khammam
- గురువుల సేవలు అమూల్యం
గురువుల సేవలు అమూల్యం
వాణి వివేకానంద విద్యాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ చుండూరు కోటేశ్వరరావు, ప్రిన్సిపాల్ వాణి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలను నేర్పుతూ విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు గురువులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు చెడు మార్గాల వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఉపాధ్యాయులపై విద్యార్థుల దాడులు ఆందోళనకరమని, విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.
అనంతరం నిర్వహించిన విద్యార్థుల స్వయం పరిపాలన దినోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల కన్వీనర్ గింజుపల్లి జనార్ధన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
