గణనాథుని సన్నిధిలో గుడిపూడి తిరుమల రావు 

గంగారం తండా వినాయక మండపంలో ప్రత్యేక పూజలు

Published On
గణనాథుని సన్నిధిలో గుడిపూడి తిరుమల రావు 

 

 

కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 18 (లోకల్ గైడ్ న్యూస్) : వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు గంగారం తండాలో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కాంగ్రెస్ నాయకులు గుడిపూడి తిరుమల రావు గురువారం సాయంత్రం గంగారం తండాలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వినాయకుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, శాంతి–సమృద్ధులతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. మండపం వద్ద భక్తుల సందడి నెలకొనగా, గ్రామస్తులు ఉత్సవాలను ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నూకల మోహన్ రావు, భూక్య నాగేశ్వరరావు, నందులాల్, అజ్మీరా చిట్టిబాబు, వస్తాం, శ్రీకాంత్, వంశీకుమార్, అజయ్, సాయికిరణ్, మంగీలాల్, భావసింగ్, సందీప్, ప్రవీణ్, శ్రీధర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

_షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం..._ _షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం..._
  ములుగు జిల్లా ఏటూరు నాగారం లోకల్ గైడ్  _ఏటూరునాగారం మండల కేంద్రంలోని క్రాస్‌రోడ్‌ ఐటీఐ వెనుక నివాసం ఉంటున్న ఇర్పా సుజాత–నరేష్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్
ఉప సర్పంచ్  ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం 
జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఆసుపత్రి పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.
గణపతి నవరాత్రుల సందర్భంగా 81వ బెటాలియన్ ఆధ్వర్యంలో అన్నదానం
చండూర్ పోలీస్ స్టేషన్‌,సర్కిల్ ఆఫీస్ ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ .
గణనాథుని సన్నిధిలో గుడిపూడి తిరుమల రావు 
పంచాయతీ సిబ్బందికి సైకిళ్లు బహూకరించి ఘన సన్మానం