- District News
- Khammam
- గణనాథుని సన్నిధిలో గుడిపూడి తిరుమల రావు
గణనాథుని సన్నిధిలో గుడిపూడి తిరుమల రావు
గంగారం తండా వినాయక మండపంలో ప్రత్యేక పూజలు
కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 18 (లోకల్ గైడ్ న్యూస్) : వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు గంగారం తండాలో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కాంగ్రెస్ నాయకులు గుడిపూడి తిరుమల రావు గురువారం సాయంత్రం గంగారం తండాలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వినాయకుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, శాంతి–సమృద్ధులతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. మండపం వద్ద భక్తుల సందడి నెలకొనగా, గ్రామస్తులు ఉత్సవాలను ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నూకల మోహన్ రావు, భూక్య నాగేశ్వరరావు, నందులాల్, అజ్మీరా చిట్టిబాబు, వస్తాం, శ్రీకాంత్, వంశీకుమార్, అజయ్, సాయికిరణ్, మంగీలాల్, భావసింగ్, సందీప్, ప్రవీణ్, శ్రీధర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
