- District News
- ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
తుర్కపల్లి ,సెప్టెంబర్ 18(లోకల్ గైడ్)
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తుర్కపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా శ్రీ రుద్ర సేన యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథుని వద్ద ఉపసర్పంచ్ పల్లె నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్ధించినట్లు తెలిపారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ సోమల వెంకటేష్ హాజరై అన్న వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తి కార్యక్రమాలతో పాటు అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు .సమాజంలో సేవా భావాన్ని పెంపొందించేందుకు యువత ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పురోహితుడు రమాకాంత్ శర్మ, బండారి శ్రీను, రొయ్యల మధు, పాముల బాలకృష్ణ గౌడ్, పాముల రాజు గౌడ్ ,బోయిని శశి కుమార్, ఆకుల బాలరాజు, బండ్ర సాయి కృష్ణ, బండ్ర ప్రశాంత్, ఎడపల్లి ప్రశాంత్, ఎడపల్లి రాజు, నాగపురి సాయిరాం , తదితరులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
